ఫ్యాక్ట్ చెక్: ఇండియాపై ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియన్ ఫ్యాన్ ‘భారత మాతా కి జై’ అన్నాడా? ఇదే నిజం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత, ఓ ఆస్ట్రేలియన్ క్రికెట్ అభిమాని ‘భారత మాతా కి జై-వందే మాతరం’ నినాదాలు చేశాడని చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By M Ramesh Naik  Published on  6 March 2025 11:41 AM IST
An Australian cricket fan was allegedly seen chanting slogans supporting India’s victory against Australia in the ICC Champions Trophy 2025 semifinals.
Claim: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత ఓ ఆస్ట్రేలియన్ ఫ్యాన్ స్టేడియంలో ‘భారత మాతా కి జై-వందే మాతరం’ నినాదాలు చేశాడు.
Fact: ఈ వీడియో తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఇది 2021లో గబ్బాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పుడు తీసినది.

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లీ సూపర్బ్ ఇనింగ్స్ తో పాటు, కేఎల్ రాహుల్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇప్పుడు ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్ తలపడనుంది.

ఈ నేపథ్యంలో, ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా ఓటమి తర్వాత ఓ ఆస్ట్రేలియన్ క్రికెట్ అభిమాని ‘భారత మాతా కి జై-వందే మాతరం’ నినాదాలు చేశాడని వీడియోలో చూపించారు. ఆస్ట్రేలియా జెర్సీ ధరించిన వ్యక్తి నినాదాలు చేస్తూ, ఇతర అభిమానులు కూడా అతనితో కలిసి నినాదాలు చేశారు.

ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను ‘‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఓ ఆస్ట్రేలియన్ ఫ్యాన్” అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. (Archive)

వీడియోపై "ఈ ఆస్ట్రేలియన్ మన హృదయాలను గెలుచుకున్నాడు" అనే టెక్స్ట్ ఓవర్‌లే ఉంది.

ఫ్యాక్ట్ చెక్:

న్యూస్‌మీటర్ ఈ వీడియోలో ఉన్న క్లెయిమ్‌ను తప్పుదారి పట్టించేదిగా గుర్తించింది. ఇది 2021లో గబ్బాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ విజయం సాధించినప్పుడు తీసిన వీడియో.

మేము కీ వర్డ్ సెర్చ్ నిర్వహించగా, జనవరి 20, 2021న ఇండియా టైమ్స్ లో ప్రచురించిన "గబ్బాలో భారత్ విజయం సందర్భంగా ‘భారత మాతా కి జై’ నినాదాలు చేసిన ఆస్ట్రేలియన్ ఫ్యాన్" అనే ఆర్టికల్‌లో ఇది కనిపించింది.

ఆర్టికల్ ప్రకారం, భారత్ 32 ఏళ్లుగా ఓటమిని చూడని గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించి, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్ నాలుగో రోజు, ఓ ఆస్ట్రేలియన్ అభిమాని ‘భారత మాతా కి జై’, ‘వందే మాతరం’ అంటూ నినాదాలు చేశాడు.

ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్ ఆర్టికల్‌లో ఉన్న ఫోటోతో సరిపోతుంది.

2021 జనవరి 21న ఇండియా టుడే లో కూడా ఇదే వీడియో ప్రచురించబడింది. ఆర్టికల్ ప్రకారం, గబ్బా టెస్ట్ చివరి రోజు భారత్ ఘన విజయం సాధించగానే ఆస్ట్రేలియన్ అభిమాని ఈ నినాదాలు చేశాడు. అతని వెంట భారత అభిమానులు కూడా కలిసి నినాదాలు చేశారు.

భారత క్రికెట్ జట్టు గబ్బాలో 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, నాలుగో టెస్ట్‌లో విజయం సాధించి, సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. షుబ్‌మన్ గిల్ 91 పరుగులు చేసి, భారత్ విజయానికి బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

అందుకని, ఈ వీడియో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌కు సంబంధించినది కాదు. ఇది 2021లో గబ్బాలో భారత్ గెలిచినప్పుడు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో

Claim Review:ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత ఓ ఆస్ట్రేలియన్ ఫ్యాన్ స్టేడియంలో ‘భారత మాతా కి జై-వందే మాతరం’ నినాదాలు చేశాడు.
Claimed By:Social Media user
Claim Reviewed By:NewsMeter
Claim Source:Instagram
Claim Fact Check:False
Fact:ఈ వీడియో తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఇది 2021లో గబ్బాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పుడు తీసినది.
Next Story