Fact Check: MLC కవిత ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించగా రూ.100 కోట్ల నగదు, 50 కేజీల బంగారం పట్టుబడిందన్న వాదన అవాస్తవం

ఢిల్లీ ఎక్సైజ్ కేసుకు సంబంధించి కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

By Sridhar  Published on  18 March 2024 3:02 PM GMT
ED raids BRS MLC Kavithas house in Hyderabad, ED arrested Kavitha in relation to Delhi excise case

ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈ నెల 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ [ED] దాడులు చేసింది. ప్రోబ్ ఏజెన్సీ జారీ చేసిన కనీసం రెండు సమన్లను కవిత దాటవేయడంతో ఈ చర్య జరిగింది.

కవిత ఇంట్లో ఈడీతో పాటు Income Tax [IT] అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వాదన చక్కర్లు కొడుతోంది.
" Big Breaking news:
BRS ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 100 కోట్లు క్యాష్ 50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న IT అధికారులు. హైదరాబాద్ సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం" అని ఆ పోస్ట్ పేర్కొంది.




నిజ నిర్ధారణ:

ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాల్లో రూ. 100 కోట్ల నగదు, 50 కేజీల బంగారం పట్టుబడిందన్న వాదన అవాస్తవమని న్యూస్‌మీటర్ తేల్చింది.

మా విచారణలో, హైదరాబాద్‌లోని BRS MLC కవిత ఇంట్లో ED మరియు IT దాడులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరియు IT అధికారుల యొక్క పత్రికా ప్రకటనలు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానెల్ ప్రసారాలు మరియు మీడియా నివేదికలను పరిశీలించిన తర్వాత. కవిత ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించి రూ. 100 కోట్ల నగదు, 50 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎలాంటి కథనాలు మాకు కనిపించలేదు.

పంచనామా [అరెస్టుకు సంబంధించిన చట్టపరమైన పత్రం] ప్రకారం, “ED అధికారులు తమను కవితకు పరిచయం చేసుకున్న తరువాత ఆమెకు సెర్చ్ వారెంట్ చూపించారు. సెర్చ్ టీమ్ ఇంటి మొత్తం సోదాలు చేపట్టింది. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమైన శోధన సాయంత్రం 6.15 గంటలకు ముగిసింది. శోధన ప్రక్రియలో, కవిత స్వచ్ఛంద స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేయబడింది. చట్టం యొక్క సరైన ప్రక్రియ తర్వాత, PMLA సెక్షన్ 19, 2002 ప్రకారం 05.20 గంటలకు ఆమె అరెస్టు చేయబడింది".
ఈడీ, ఐటీ దాడుల్లో కేవలం ఐదు మొబైల్ ఫోన్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు పంచనామా పేర్కొంది.

తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు తమ ఎదుట హాజరు కావాలని ఐటీ, ఈడీ గతంలో కవితకు నోటీసులు జారీ చేయగా, ఆ నోటీసులపై ఆమె సుప్రీంకోర్టులో అప్పీలు చేసి హాజరుకావడానికి నిరాకరించారు.

ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ప్రకారం అనుచిత ప్రయోజనాలకు బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు 100 కోట్ల రూపాయల కిక్‌బ్యాక్‌లు చెల్లించిన ‘సౌత్ గ్రూప్’లో కవిత భాగమని ED తన ఛార్జిషీట్‌లో ఆరోపించింది.

ఈ కేసుకు సంబంధించి ముగ్గురు కీలక ఆప్ నేతలు - మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ మరియు విజయ్ నాయర్ - ఇప్పటికే జైలులో ఉన్నారు.
అందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాల్లో రూ.100 కోట్ల నగదు, 50 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం అవాస్తవమని మేము నిర్ధారించాము.

Claim Review:IT seized Rs. 100 crore cash and 50 Kg gold during raids at BRS MLC Kavitha's house in Hyderabad
Claimed By:Facebook users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story