ఫ్యాక్ట్ చెక్: తెలంగాణలో భూకంపం ఇంత బీభత్సం సృష్టించిందా.? వైరలవుతున్న ఫోటోల వెనక నిజమిదే
తెలంగాణ భూకంపానికి సంబంధించినవి అంటూ దెబ్బతిన్న రహదారులు, కూలిన భవనాల చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
By Newsmeter Network Published on 4 Dec 2024 9:42 PM IST
Claim: వైరల్ చిత్రాలు తెలంగాణ భూకంపం తర్వాతి స్థితిని చూపిస్తున్నాయి.
Fact: ఈ చిత్రాలు పాతవి మరియు తెలంగాణ భూకంపానికి ఏటువంటి సంబంధం లేదు.
హైదరాబాద్: డిసెంబర్ 4, బుధవారం ఉదయం 7:27 గంటలకు తెలంగాణలోని ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) ప్రకారం, భూకంప కేంద్రం 40 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం ప్రభావం హైదరాబాద్తో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపించింది.
భూకంపం తర్వాత, కూలిన భవనాలు, దెబ్బతిన్న రహదారులను చూపించే అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి తెలంగాణలో భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని చూపిస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఈ కథనంలో, ఇలాంటి ఐదు చిత్రాలను ఫ్యాక్ట్ చెక్ చేయబోతున్నాం
Image 1: ఈ ఫోటో లో కూలిన ఒక భవనం కనిపిస్తోంది, దాని ముందు భాగం మొత్తం దెబ్బతిన్నది, మూడవ అంతస్తులోని అంతర్గత భాగాలు బయటపడ్డాయి. ఒక కారు ఆశ్చర్యకరంగా రెండవ అంతస్తులో పార్క్ చేసి ఉండడం మనం చూడవచ్చు,
ఈ చిత్రాన్ని "హైదరాబాద్ తీవ్ర భూకంపంతో కుదిపివేయబడింది" అనే టెక్స్ట్తో X పోస్ట్ చేశారు.
ఫాక్ట్:
న్యూస్మీటర్ ఆధునిక డీప్ ఫేక్ టూల్స్ ఉపయోగించి, ఈ చిత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించబడినది అని, ఇది హైదరాబాద్లో భూకంపం తరువాతి పరిస్థితిని అన్న వాదన తప్పు అని నిర్ధారించింది.
హైవ్ మోడరేషన్ ఈ చిత్రం 99.9% AI తో రూపొందించినది లేదా డీప్ ఫేక్ కంటెంట్ అని స్పష్టం చేసింది.
Image 2: ఈ చిత్రంలో పగిలిన రహదారి కనిపిస్తోంది, పెద్ద చీలికలు రహదారిని విడగొట్టాయి. చుట్టూ ధూళి, మట్టితో కనిపిస్తున్నాయి. ఫొటోలో కొన్ని వాహనాలు, అడ్డంకులు కూడా చూడవచ్చు.
ఈ చిత్రాన్ని “హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం వంటి ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు భూకంపం సంభవించింది" (ఆంగ్లం నుండి అనువదించబడింది) అనే శీర్షికతో షేర్ చేస్తున్నారు.
ఫాక్ట్:
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, ఈ ఫోటో PxHere అనే ఉచిత స్టాక్ ఇమేజ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఈ వెబ్ సైట్ ప్రకారం, దీనిని బర్నార్డ్ స్ప్రాగ్ అనే వ్యక్తి 2017 జనవరి 16న అప్లోడ్ చేశారు. ఈయన న్యూజిలాండ్కు చెందిన ఒక ట్రావెల్ ఫోటోగ్రాఫర్. అలాగే, చిత్రానికి ఇచ్చిన ఆల్ట్ డిస్క్రిప్షన్ ద్వారా, ఇది న్యూజిలాండ్లో జరిగిన భూకంపం తర్వాత తీసినదని స్పష్టమవుతోంది.
అందువల్ల, ఈ చిత్రం తెలంగాణ భూకంపం కారణంగా దెబ్బతిన్న రహదారి అన్న వాదన తప్పు.
Image 3: ఈ చిత్రంలో కంక్రీట్ రోడ్డు మీద పగుళ్లు చూడవచ్చు. ఈ పగుళ్ళతో కింద ఉన్న భూమి పైపొర బయటకు కనిపిస్తుంది.
ఒక X యూజర్ తెలంగాణ భూకంపం విషయం షేర్ చేస్తూ ‘తెలంగాణ ములుగులో భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదయ్యాయి’ అని పోస్ట్ చేశారు.
ఫాక్ట్:
ఈ చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా పరిశీలించగా, శాన్ డియాగో యూనియన్-ట్రిబ్యూన్ అనే పత్రికలో "క్యాలిఫోర్నియాలో భూకంపాలు 15 మైళ్ల లోతు వరకు గుర్తించబడ్డాయి, ఇది సిస్మిక్ భయాలను పెంచుతోంది" అనే శీర్షికతో ఒక కథనం దొరికింది. ఈ కథనం 2016 అక్టోబర్ 6న ప్రచురించబడింది. ఫోటో క్రెడిట్స్ లో ప్రచురించబడిన నివేదిక, “లాస్ ఏంజెల్స్ టైమ్స్కి చెందిన అలెన్ J. షాబెన్” అని పేర్కొనబడింది. నివేదిక ప్రకారం, ఛాయాచిత్రం 2014లో హంటింగ్టన్ బీచ్లోని సీక్లిఫ్ ప్రాంతంలోని డిస్కవరీ వెల్ పార్క్ వద్ద కాలిబాటపై ఏర్పడిన పగుళ్లను చూపిస్తుంది, ఇది న్యూపోర్ట్-ఇంగిల్వుడ్ ఫాల్ట్ వెంట ఉంది.
కాబట్టి ఈ ఫోటోకు తెలంగాణ భూకంపంతో ఏటువంటి సంబంధం లేదు.
Image 4: ఈ చిత్రంలో పగుళ్లు ఉన్న రహదారి కనిపిస్తోంది. రోడ్డు ఒకవైపు కుంగిపోతున్నట్లు కనిపిస్తోంది. చుట్టుపక్కల పగలిన అస్ఫాల్ట్ ముక్కలు, కొంత నిర్మాణ సామగ్రి కూడా కనిపిస్తోంది.
ఈ చిత్రం అదే X వినియోగదారు ద్వారా పోస్ట్ చేయబడింది.
ఫాక్ట్:
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, ఈ చిత్రం iStockphoto వెబ్సైట్లో స్టాక్ ఇమేజ్గా అప్లోడ్ చేసినదని గుర్తించాం. వెబ్సైట్ వివరాల ప్రకారం, ఈ చిత్రాన్ని SDubi అనే యూజర్ 2015 ఫిబ్రవరి 20న అప్లోడ్ చేశారు.
కాబట్టి, ఈ చిత్రానికి, తెలంగాణ భూకంపానికి ఎలాంటి సంబంధం లేదు.
ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా అదే చిత్రం ఉపయోగించబడింది, అయితే ఇది "స్టాక్ ఇమేజ్" వాటర్మార్క్ను కలిగి ఉంది. అయితే, పోస్ట్కి 65,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి, కామెంట్ సెక్షన్లో చాలా మంది చిత్రం హైదరాబాద్కి చెందినదని భావించారు.
ఫాక్ట్:
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, ఇది Shutterstock అనే వెబ్సైట్లో కనుగొన్నాం.ఈ చిత్రాన్ని ‘I Love Photo’ అనే యూజర్ 2014 మే 5న చియాంగ్ రాయ్, థాయ్లాండ్ లో భూకంపం తరువాత కూలిన అస్ఫాల్ట్ రహదారి అని, సైనికులు స్థలాలను తనిఖీ చేస్తున్నట్లు షేర్ చేశారు.
కాబట్టి, ఇది తెలంగాణ భూకంపానికి ఏటువంటి సంబంధం లేదు.
భారీ నష్టం జరగలేదు
ద హిందూ నివేదిక ప్రకారం, ములుగు జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర 5.3 తీవ్రత గల భూకంపం వల్ల పెద్దగా నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదని పేర్కొన్నారు. సుమారు 6-8 సెకన్ల పాటు తక్కువ స్థాయిలో కంపనాలు ఉదయం 7:30 నుంచి 7:40 గంటల మధ్య అనుభవించామన్నారు. భూకంపం అనంతరం ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం ఉందా అని గుర్తించేందుకు ఎంపీడీవోలు, ఎంఆర్వోలు, ఎంవోపోలు, పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం సీనియరుగా ఉన్న ఇళ్లు, తాత్కాలిక గృహాలను పరిశీలించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, పూర్తి నివేదిక రాగానే తదుపరి సమాచారం అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు.