Fact Check: మహిళలు సీట్ల కోసం గొడ‌వ‌ప‌డుతున్న వీడియోకు, ఏపీ ‘స్త్రీ శక్తి’ పథకానికి సంబంధం లేదు.. నిజం ఇది

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా మహిళలు బస్సులో కొట్టుకున్నారని చెబుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By M Ramesh Naik
Published on : 20 Aug 2025 8:00 PM IST

A video claiming to show a fight among female passengers inside a bus after the Andhra Pradesh government’s free bus travel scheme for women was launched is circulating on social media.
Claim:ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం తరువాత, మహిళలు సీట్ల కోసం బస్సులో కొట్టుకున్న ఘటన ఈ వీడియోలో కనిపిస్తుందని అంటున్నారు.
Fact:ఈ వీడియోకు ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు పథకంతో ఎలాంటి సంబంధం లేదు. ఇది తెలంగాణలో 2024 జనవరిలో జరిగిన సంఘటన.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ‘స్త్రీశక్తి’ పథకంను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు APSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా NDA నాయకులు హాజరయ్యారు.
ఇదే సమయంలో, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో బస్సులో మహిళలు సీట్ల కోసం కొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీన్ని ఏపీ ఉచిత బస్సు పథకంతో ముడిపెట్టి, "విజయనగరం-కొత్తవలస రూట్ బస్సులో ఈ ఘటన జరిగింది" అని పోస్టులు చెబుతున్నాయి.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ, “ఏపీలో ఇటీవల ప్రారంభమైన ఉచిత బస్సు పథకం కారణంగా బస్సులో సీట్ల కోసం మహిళా ప్రయాణీకుల మధ్య గొడవ జరిగింది. విజయనగరం నుంచి కొత్తవలస వెళ్లే బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది” అని రాశాడు. (ఆర్కైవ్)

ఫ్యాక్ట్ చెక్

న్యూస్ మీటర్ ఈ వీడియో ఏపీదే కాదని, ఉచిత బస్సు పథకంతో సంబంధం లేదని కనుగొంది.
వైరల్ వీడియోని కీలక ఫ్రేములుగా విడదీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇది 2024 జనవరిలో
తెలంగాణలో జరిగిన ఘటన
అని జీ న్యూస్ ఒక రిపోర్ట్‌లో వెల్లడించింది.
అదే వీడియోను 2024 జనవరిలో యూట్యూబ్‌లో ‘సంగారెడ్డి నుంచి జహీరాబాద్ కు ఉచిత బస్సులో మహిళల గొడవ.’ అనే టైటిల్‌తో కూడా అప్‌లోడ్ చేశారు.
అదనంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ అధికారిక X అకౌంట్లో కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. “తెలంగాణ రాష్ట్రంలో 2024 జనవరి 1న బస్సు ప్రయాణంలో మహిళల మధ్య జరిగిన కొట్లాటను ఏపీలో స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు కొట్టుకుంటున్నట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిపే ఇటువంటి ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు తప్పవు.” అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు పథకం కారణంగా మహిళలు బస్సులో గొడవపడ్డారని చెబుతూ వైరల్ అవుతున్న వీడియో అసత్యం. ఆ వీడియో తెలంగాణలో 2024 జనవరిలో జరిగిన సంఘటనకు సంబంధించిన‌ది.
Claim Review:ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం తరువాత, మహిళలు సీట్ల కోసం బస్సులో కొట్టుకున్న ఘటన ఈ వీడియోలో కనిపిస్తుందని అంటున్నారు.
Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఈ వీడియోకు ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు పథకంతో ఎలాంటి సంబంధం లేదు. ఇది తెలంగాణలో 2024 జనవరిలో జరిగిన సంఘటన.
Next Story