Fact Check: "దేశానికి ముగ్గురు శత్రువులు - ముస్లింలు, క్రిస్టియన్లు, సోషలిస్టులు" అని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారా? అసలు సంగతి ఇదే

ఒక వీడియోలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దేశానికి ముస్లింలు, క్రిస్టియన్లు, సోషలిస్టులే శత్రువులని అన్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By M Ramesh Naik
Published on : 11 Jun 2025 3:19 PM IST

A viral video claims to show former Congress MP Undavalli Arun Kumar stating that India’s three enemies are Muslims, Christians, and Socialists, sparking controversy on social media.
Claim:ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, “దేశానికి ఉన్న ముగ్గురు శత్రువులు: ఒకటి ముస్లింలు, రెండు క్రిస్టియన్లు, మూడు సోషలిస్టులు” అన్నారు.
Fact:ఈ వాదన తప్పుదోవ పట్టించేది. ఈ మాటలు ఆయన స్వయంగా చెప్పలేదు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు గోల్వాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. ఆ పుస్తకంలోని భావజాలాన్ని విమర్శిస్తూ చెప్పారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఒక ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “దేశానికి ముస్లింలు, క్రిస్టియన్లు, సోషలిస్టులే శత్రువులు” అని అన్నట్లు ఓ షార్ట్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి “అంత చెడ్డగుణమే ఉండదు అనడానికి ప్రూఫ్.. దేశానికి పనికొచ్చే మాట చెప్పాడు.. నేను విన్న ఒకే ఒక్క మంచి మాట ఈయన నోటి నుంచి” అనే క్యాప్షన్ పెట్టాడు.(Archive)

ఫ్యాక్ట్ చెక్

న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ వీడియో తప్పుదోవ పట్టించేది అని తేలింది. వైరల్ అవుతున్న క్లిప్‌ పూర్తి ప్రెస్‌మీట్‌లో భాగం మాత్రమే. ఉండవల్లి గోల్వాల్కర్ రచించిన 'బంచ్ ఆఫ్ థాట్స్' అనే పుస్తకాన్ని ప్రస్తావిస్తూ, ఆలోచనా విధానాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. ఆయన స్వయంగా ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు.

కీవర్డ్ సెర్చ్ ద్వారా మేము ఒక పూర్తి నిడివి గల TV5 న్యూస్ 2022 ఏప్రిల్ 15న ప్రెస్‌మీట్ వీడియోను “LIVE: Undavalli Arun Kumar Sensational Press Meet on Jagan Govt.” పేరుతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. అందులో 12:53 నిమిషాల సమయంలో ఉండవల్లి ఇలా అంటారు: “ఆ పుస్తకంలో గోల్వాల్కర్ పేర్కొన్నారు.. దేశానికి ముగ్గురు శత్రువులు ఉన్నారు - ముస్లింలు, క్రిస్టియన్లు, సోషలిస్టులు.”

ఈ మాటల ద్వారా ఆయన, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. దీనిపై మరో పత్రిక ది వైర్ 2024 అక్టోబర్ 15న ప్రచురించిన కథనంలో గోల్వాల్కర్ సిద్ధాంతాలపై ఇలా చెప్తుంది: “ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం హిందువులను ఒకచోట చేర్చటం.. హిందువులను ముగ్గురు శాశ్వత శత్రువుల నుంచి కాపాడటం: ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు.”

ఇది ఉండవల్లి ప్రస్తావించిన అంశానికి అనుగుణంగా ఉంటుంది.

ఈ వీడియో తప్పుడు వివరాలతో ప్రచారం అవుతోంది. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దేశ శత్రువులుగా ముస్లింలు, క్రిస్టియన్లు, సోషలిస్టులను పేర్కొనలేదు. ఆయన గోల్వాల్కర్ పుస్తకాన్ని ఉదహరిస్తూ ఆ భావజాలాన్ని విమర్శించారు. అసలు ప్రసంగాన్ని కత్తిరించి, దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ దావా మోసపూరితమైనదని నిరూపిత‌మైంది.

Claim Review:ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, “దేశానికి ఉన్న ముగ్గురు శత్రువులు: ఒకటి ముస్లింలు, రెండు క్రిస్టియన్లు, మూడు సోషలిస్టులు” అన్నారు.
Claimed By:Social media user
Claim Reviewed By:NewsMeter
Claim Source:Instagram
Claim Fact Check:False
Fact:ఈ వాదన తప్పుదోవ పట్టించేది. ఈ మాటలు ఆయన స్వయంగా చెప్పలేదు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు గోల్వాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. ఆ పుస్తకంలోని భావజాలాన్ని విమర్శిస్తూ చెప్పారు.
Next Story