Hyderabad: జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 242 మంది ప్రయాణికులతో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది.
ఈ సందర్భంలో విమాన ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూపిస్తోంది అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ చిత్రం ప్రచారం అవుతోంది.
నాలుగు అంతస్తుల భవనంపైకి కూలిపోయిన ‘ఎయిర్ ఇండియా’ లోగో ఉన్న విమానాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ
చిత్రాన్ని ఫేస్బుక్లో షేర్ చేసి క్యాప్షన్లో “ఎయిర్ ఇండియా విమానాలు టాటా గాడికి, విమానాశ్రయాలు అధాని గాడికి కట్టబెట్టిన దుర్మార్గం ఫలితం ఈ ఘోరం....DGCI ఆ ఫ్లైట్ ను నడపవద్దు అని వార్నింగ్ ఇచ్చినా పట్టించు కోలేదు - వార్త... అదే ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగంలో ఉండి ఉంటే అ ఫ్లైట్ ని నడిపేద? ప్రయివేటు పరం చేసినోడిని ఏమనాలి?” అని రాశారు. (
ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న
చిత్రాన్నిఫేస్బుక్లో షేర్ చేసి క్యాప్షన్లో “నేను తరచుగా ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణిస్తాను, కానీ నాకు ఎప్పుడూ ఆహ్లాదకరమైన అనుభవం లేదు. విమానం లోపలి భాగం చాలా తక్కువగా ఉంటుంది. విస్తారా, ఇండిగో మంచి ప్రత్యామ్నాయాలు. విమానాల నాణ్యతను ఆడిట్ చేయడం అవసరం” అని రాశారు. (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది) (
ఆర్కైవ్)
Fact Check
న్యూస్మీటర్ వైరల్ వాదనలు తప్పు అని కనుగొంది. చిత్రం ఏఐ ద్వారా రూపొందించబడింది.
చిత్రాన్ని నిశితంగా విశ్లేషించిన తర్వాత, విమానం భవనంతో కలిసిపోతుందని, చిత్రంలో లైటింగ్ ఏకరీతిగా ఉందని కనుగొన్నాం, ఇది ఏఐ జనరేట్ చేసిన చిత్రాలకు సాధారణ సూచన.
ఏఐ డిటెక్షన్ టూల్,
హైవ్ మోడరేషన్ ఉపయోగించి, చిత్రంలో 99.7 శాతం ఏఐ-జనరేటెడ్ లేదా డీప్ఫేక్ కంటెంట్ ఉండే అవకాశం ఉందని కనుగొన్నాం.
సైట్ ఇంజిన్ కూడా చిత్రాన్ని విశ్లేషించి, చిత్రం 99 శాతం ఏఐతో జనరేట్ చెయ్యబడి ఉండే అవకాశం ఉందని నిర్ధారించింది.
కాబట్టి, న్యూస్మీటర్ వైరల్ వాదనలు తప్పు అని తేల్చింది. చిత్రం ఏఐ ద్వారా జనరేట్ చేయబడింది.