Fact Check: భారత ప్రభుత్వం రష్యన్ సైన్యంలో పోరాడటానికి పంజాబ్ యువకులను పంపుతుందా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి

భారత ప్రభుత్వం రష్యన్ సైన్యంలో పోరాడటానికి పంజాబ్ యువకులను అమ్మేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

By -  K Sherly Sharon
Published on : 19 Sept 2025 10:14 PM IST

Fact Check: భారత ప్రభుత్వం రష్యన్ సైన్యంలో పోరాడటానికి పంజాబ్ యువకులను పంపుతుందా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
Claim:భారత ప్రభుత్వం రష్యన్ సైన్యంలో పోరాడటానికి పంజాబ్ నుండి యువకులను పంపుతోంది.
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. రష్యన్ సైన్యంలోకి బలవంతంగా చేర్చబడిన పంజాబ్ యువకులను అక్కడికి పంపింది ఏజెంట్లు.

Hyderabad: భారత ప్రభుత్వం పంజాబ్ నుండి వచ్చిన యువకులను రష్యన్ సైన్యానికి విక్రయించినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోను Xలో షేర్ చేస్తూ, క్యాప్షన్‌లో ఇలా రాశారు “రష్యా నుండి కలవరపెట్టే వార్తలు. పంజాబ్‌లోని ప్రభుత్వ ప్రతినిధులు సిక్కులను విదేశాలకు నకిలీ ఉద్యోగ ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు, వారిని రష్యాకు రవాణా చేస్తున్నారు, అక్కడ వారు ఫ్రంట్‌లైన్ పోరాటంలోకి బలవంతంగా పంపబడుతున్నారు. ఈ సరిహద్దు మానవ దోపిడీకి తక్షణ దర్యాప్తు అవసరం. ” (ఆర్కైవ్)

మరో X పోస్టులో అదే వీడియోను షేర్ చేస్తూ ఇలా రాశారు "భారత ప్రభుత్వం, సైన్యం రష్యాలో ఉద్యోగ ఆఫర్లతో అమాయక పంజాబీ యువతను మోసం చేసి, వారిని రష్యన్ ఆర్మీకి అమ్మేసి ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ముందు వరుసలకు పంపాయి. భారత రాజ్యం, దాని దళాల సిగ్గులేని ద్రోహం" అనే శీర్షికతో షేర్ చేశారు. (ఆర్కైవ్)

Fact Check

వైరల్ క్లెయిమ్స్ అబద్ధమని న్యూస్‌మీటర్ కనుగొంది. రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేర్చబడిన పంజాబ్ యువకులను ఏజెంట్లు అక్కడికి పంపారు.

కీవర్డ్ శోధనలను ఉపయోగించి, సెప్టెంబర్ 12న ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన “'సైన్యంలోకి మోసగించబడి, రష్యన్ సైన్యం కోసం పోరాడవలసి వచ్చింది': భారతీయ యువకులు SOS వీడియోలను పంపారు” అనే నివేదికను కనుగొన్నాం.

వైరల్ వీడియోను గురించి ప్రస్తావిస్తూ, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇలా పేర్కొంది, “రష్యన్ సైనిక దుస్తులు ధరించిన యువకులు ఉద్యోగాలు లేదా విద్యార్థి వీసాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఏజెంట్లచే తప్పుదారి పట్టించబడ్డారని పేర్కొంటూ, తక్షణ రక్షణ కోసం వేడుకుంటున్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి.”

హిందూస్తాన్ టైమ్స్ సెప్టెంబర్ 17న ఒక నివేదికను ప్రచురించింది. ఆ నివేదికలో వైరల్ వీడియో నుండి తీసిన స్క్రీన్‌షాట్ ఉంది.

ఆ నివేదికలో ఇద్దరు వ్యక్తులను లూధియానాకు చెందిన సమర్జీత్ సింగ్, మోగాకు చెందిన బూటా సింగ్‌గా గుర్తించారు. సమర్జీత్ సింగ్ కుటుంబం అతను లూధియానాలోని స్థానిక ఏజెంట్ ద్వారా వచ్చాడని తెలిపింది. తన తండ్రి చరాజిత్ సింగ్‌ను ఉటంకిస్తూ ఆ హిందూస్తాన్ టైమ్స్ ఇలా పేర్కొంది, “అతను నిర్మాణ రంగంలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవాలి.”

బూటా సింగ్ సోదరిని ఉటంకిస్తూ ఆ నివేదిక ఇలా పేర్కొంది, “సింగ్ సోదరి కరమ్‌జిత్ కౌర్ తన సోదరుడు 2024 అక్టోబర్‌లో ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా భాషా కోర్సును అభ్యసించడానికి రష్యాకు వెళ్లాడని ఫోన్‌లో చెప్పింది.”

విదేశాంగ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 11న విడుదల చేసిన ఒక ప్రకటనలో, రష్యన్ సైన్యంలోకి భారతీయులను నియమించడంపై మీడియా ప్రశ్నలకు సమాధానంగా, అధికారిక ప్రతినిధి శ్రీ రణధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని రష్యన్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

“గత సంవత్సరం కాలంగా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఈ చర్యలో అంతర్లీనంగా ఉన్న ప్రమాదాలు మరియు సమస్యలను సూచించింది మరియు తదనుగుణంగా భారతీయ పౌరులను హెచ్చరించింది. ఈ పద్ధతిని ముగించమని మరియు మా జాతీయులను విడుదల చేయమని అడగడం ద్వారా ఢిల్లీ మరియు మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి కూడా మేము ఈ విషయాన్ని తీసుకువచ్చాము.”

“ప్రభావితమైన భారతీయ పౌరుల కుటుంబాలను కూడా మేము సంప్రదిస్తున్నాము” అని రణధీర్ జైస్వాల్ అన్నట్లు ఈ ప్రకటన పేర్కొంది.

కాబట్టి, పంజాబ్ నుండి రష్యన్ సైన్యంలోకి బలవంతంగా నియమించబడిన యువకులను ఏజెంట్లు అక్కడికి పంపారని స్పష్టంగా తెలుస్తుంది. వారిని రష్యాకు పంపడంలో భారత ప్రభుత్వం ప్రమేయం లేదు.

వైరల్ క్లెయిమ్స్ అబద్ధమని న్యూస్‌మీటర్ తేల్చింది.

Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. రష్యన్ సైన్యంలోకి బలవంతంగా చేర్చబడిన పంజాబ్ యువకులను అక్కడికి పంపింది ఏజెంట్లు.
Next Story