Fact Check: నేపాల్‌లో మోదీకి మద్దతుగా ప్రదర్శన జ‌రిగిందా? నిజం ఇక్క‌డ తెలుసుకోండి

నేపాల్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ప్రదర్శన అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్.

By -  M Ramesh Naik
Published on : 12 Sept 2025 7:00 PM IST

A viral video claims that people in Nepal marched in support of Prime Minister Narendra Modi amid the ongoing crisis.
Claim:ప్రస్తుతం జరుగుతున్న అశాంతి సమయంలో నేపాల్ ప్రజలు మోదీకి మద్దతుగా ర్యాలీ చేశారు.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియో నేపాల్‌ది కాదు, సిక్కింలోని లింబూ తెగ నిర్వహించిన స్వాగత ప్రదర్శనది.

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో కూడిన బ్యానర్ పట్టుకొని, జెండాలు ఊపుతూ, వాయిద్యాలతో ప్రదర్శన చేస్తున్న జనాలు కనిపిస్తున్నారు.

ఒక ఫేస్‌బుక్ యూజర్ “నేపాల్ ప్రజల హృదయాల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ..” అంటూ వీడియోను షేర్ చేశాడు (ఆర్కైవ్).

ఇలాంటి పోస్ట్లు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.(ఆర్కైవ్1, ఆర్కైవ్2)

ఫాక్ట్ చెక్

న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పు అని తేలింది. వీడియో నేపాల్‌ది కాదు, సిక్కింలోది.

వీడియోలో కనిపిస్తున్న బ్యానర్‌పై ఇంగ్లీషులో ఇలా రాసి ఉంది:“SIKKIMESE LIMBOO TRIBES WARMLY WELCOME TO HONOURABLE PRIME MINISTER OF INDIA SHRI NARENDRA MODI JI TO THE STATE OF SIKKIM. – Sukhim Yakthung Sapsok Songchumbho.”

దీని ద్వారా ఈ ఈవెంట్ సిక్కింకు సంబంధించిన సాంస్కృతిక, రాజకీయ పరిణామమని స్పష్టమవుతోంది.

కీవర్డ్ సెర్చ్‌లో మేము ఆ ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వీడియోను ఫేస్‌బుక్‌లో కనుగొన్నాము. సుఖిం యక్తుంగ్ సప్సోక్ సాంగ్చంభో అనే సంస్థ 2025 మే 30న వీడియోను షేర్ చేసింది.

కాప్షన్ ప్రకారం, సిక్కింకు రాష్ట్ర హోదా వచ్చిన 50 ఏళ్ల సందర్భంగా 2025 మే 29న ప్రధాని మోదీ రానున్నారని భావించి లింబూ తెగ ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు.

అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని మోదీ విమానం సిక్కింలో ల్యాండ్ కాలేదు. ఆయన బాగ్‌డోగ్రా నుంచి వర్చువల్‌గా సిక్కిం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

వైరల్ వీడియో, ఫేస్‌బుక్ వీడియో స్క్రీన్‌షాట్‌లను పక్కపక్కన ఉంచి పోల్చితే రెండూ ఒకే ఈవెంట్‌కి చెందినవని నిర్ధారణ అయ్యింది.

ఈ ఈవెంట్ ఏమిటి?

సుఖిం యక్తుంగ్ సప్సోక్ సాంగ్చంభో అనేది గ్యాంగ్‌టక్‌లోని ఒక కమ్యూనిటీ సంస్థ. ఇది సిక్కింలోని గుర్తింపు పొందిన లింబూ తెగకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్ర స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా వారు ఈ సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించారు.

2025 మే 29న సిక్కిం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రధానమంత్రి మోదీ పాల్జోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలకు నేరుగా రాలేకపోయినా, వర్చువల్‌గా ప్రసంగించారు.

వైరల్ వీడియోలో నేపాల్ ప్రజలు మోదీకి మద్దతుగా ప్రదర్శన చేశారనే క్లెయిమ్ అసత్యం.

అది సిక్కింకు చెందిన లింబూ తెగ నిర్వహించిన స్వాగత ర్యాలీ వీడియో.

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారిస్తుంది.

Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియో నేపాల్‌ది కాదు, సిక్కింలోని లింబూ తెగ నిర్వహించిన స్వాగత ప్రదర్శనది.
Next Story