హైదరాబాద్: 2026 ప్రారంభంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు, ఫ్యాన్ వార్స్ కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాలకు, పవన్ కల్యాణ్ నమస్కారం చేస్తున్నట్లుగా చూపించే ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
Fact Check
న్యూస్మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ అవుతున్న ఫోటో ఎడిట్ చేసినదని గుర్తించింది.
ముందుగా, పవన్ కల్యాణ్ నిజంగా చంద్రబాబు నాయుడు పాదాలను తాకిన సంఘటనకు సంబంధించి ఏవైనా వార్తా కథనాలు లేదా అసలు ఫోటోలు ఉన్నాయా అనే కోణంలో కీవర్డ్ సెర్చ్ చేయగా, అలాంటి విశ్వసనీయ సమాచారం ఏదీ లభించలేదు.
ఆ 2019 ఫోటోను వైరల్ చిత్రంతో పోల్చి చూడగా, పవన్ కల్యాణ్ శరీర భంగిమ, ఆయన వేసుకున్న చెప్పులు, షర్ట్ మడతలు అన్నీ ఒకేలా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అంటే, పవన్ కల్యాణ్ ఉన్న భాగాన్ని మాయావతి ఘటనకు సంబంధించిన ఫోటో నుంచి తీసుకున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు ఉన్న భాగాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ది ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్లో ప్రచురితమైన ఒక ఫోటో లభించింది. ఆ అసలు ఫోటోలో చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్తో మాట్లాడుతూ నిలబడి ఉన్నారు. చంద్రబాబు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, చెప్పులు, నిలబడిన తీరు— ఇవన్నీ వైరల్ ఫోటోలో ఉన్నట్లే ఉన్నాయి.
వైరల్ అవుతున్న ఈ ఫోటో రెండు వేర్వేరు, సంబంధం లేని ఫోటోలను కలిపి రూపొందించిన డిజిటల్ ఎడిట్.
ఒకటి—2019లో పవన్ కల్యాణ్ మాయావతి పాదాలకు నమస్కారం చేసిన ఫోటో,
మరొకటి—చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్తో నిలబడి మాట్లాడుతున్న ఫోటో.
ఈ రెండింటిని కలిపి, పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడు పాదాలకు నమస్కరిస్తునట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పు.