Hyderabad: జూన్ 12న లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అహ్మదాబాద్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని సిబ్బందితో సహా 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదానికి సంబంధించి ఒక సంచలన వీడియో లీక్ అయ్యింది అనే క్లెయిమ్లతో ఓ పోస్ట్ సోషల్ సోషలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో, విమానంలో కూర్చున్న ప్రయాణికులను, సిబ్బందిని చూపించి ఒక వ్యక్తి ఇలా అన్నారు, "ఇది పాట్నా విమానం. ఇది ఎయిర్ ఇండియా విమానం... ఈరోజు తారీకు 18. విమానం 4 గంటలకు. మేము ఏసీ లేకుండా గంట నుండి విమానంలో ఉన్నాం. ఎంత చెమటలు పడుతున్నాయో మీరు చూడవచ్చు. పిల్లలు ఆందోళన చెందుతున్నారు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు కానీ చూడటానికి ఎవరూ లేరు."
ఈ వీడియోని సీవీఆర్ న్యూస్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేసి టైటిల్లో "ఫ్లైట్ క్రాష్ లో వృద్ధుడి మరో సంచలన వీడియో లీక్ | Air India Flight Crash Video Leak | CVR News" అని రాశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ వీడియో మే 18న ఢిల్లీ నుండి పాట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తీసినది.
ఎయిర్ ఇండియా డ్రీం లైన్ AI171 విమానంలో అదే రోజు ఢిల్లీ నుండి అహ్మదాబాద్ ప్రయాణించిన ఆకాష్ వత్సా విమానంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో చెప్పారని CNBC 18 ఒక కథనంలో పేర్కొంది.
"ఏసీ పనిచేయడం లేదు. చాలా మంది మ్యాగజైన్లు వాడుతున్నారు..." ఆకాష్ పేర్కొన్నారని రాసారు.
అయితే వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, పూర్తి వీడియో మే 18న Xలో అప్లోడ్ చేయబడినట్లుగా గుర్తించాం. ఈ పోస్ట్ క్యాప్షన్లో ఇలా రాశారు, "ఇది ఎయిర్ ఇండియా ఢిల్లీ పాట్నా విమానం. చెప్పనవసరం లేదు, వాటిని చూసి వినండి. రాయడం వల్ల ఏదైనా ప్రభావం ఉంటుందని ఆశించవద్దు. కేవలం 10 రోజుల క్రితం, పాట్నా ఢిల్లీ విమానం పరిస్థితి కూడా అలాగే ఉంది..."
అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జూన్ 12న జరిగింది. అయితే వైరల్ వీడియో మే 18 నాటికే ఆన్లైన్లో అప్లోడ్ చేయబడింది. కూలిపోయిన ఎయిర్ ఇండియా డ్రీం లైన్ విమానం అహ్మదాబాద్ నుండి లండన్కు ప్రయాణమైంది, ఈ X పోస్టు ప్రకారం వైరల్ వీడియోలో ఉన్న విమానం ఢిల్లీ నుండి పాట్నాకు వెళ్తుంది.
న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ మే 18న ఇదే X పోస్టును షేర్ చేస్తూ ఎయిర్ ఇండియా AI 2521 విమానం మధ్యాహం 4.45 కు ఐజిఐ ఎయిర్పోర్ట్ మూడవ టెర్మినల్ నుండి బయలుదేరాల్సి ఉండగా, ఏసీ పనిచేయకపోవడం మూలంగా రాత్రి 8.35 కి టేక్ ఆఫ్ అయ్యింది అని పేర్కొంది. ఈ కథనంలో వైరల్ వీడియోలో నుండి తీసిన స్క్రీన్ షాట్ ఉపయోగించారు.
ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ NDTV, ఇండియా టీవీ కూడా కథనాలు ప్రచురించాయి.
కాబట్టి వైరల్ వీడియోలో ఉన్నది అహ్మదాబాద్ విమానం ప్రమాదానికి సంబంధించిన వీడియో కాదు. ఈ వీడియో మే 18న ఢిల్లీ నుండి పాట్నా వెళ్లే విమానంలో ఏసీ పని చేయనప్పుడు, ప్రయాణికులు గంట సేపు అలాగే తిప్పల పాలవడం చూపిస్తోంది.
న్యూస్మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.