Hyderabad: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్లేన్ సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
జూన్ 12న ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా సిబ్బందిని చూపిస్తోంది అనే క్లెయిమ్లతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, ఎయిర్ ఇండియా ప్లేన్ సిబ్బంది యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులు నడుస్తుండగా, యూనిఫామ్లో ఉన్న ఒక మహిళ వారిని వీడియో తీస్తున్నట్లుగా చూడవచ్చు.
వీడియోపై "గుజరాత్ లో అహమ్మదాబాద్ ప్లేన్ క్రాష్" అని రాసి ఉంది. ఈ వీడియోని ఫేస్బుక్లో షేర్ చేస్తూ "నిన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయిన మొత్తం స్టాఫ్" అని క్యాప్షన్లో రాశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. వీడియోలో ఉన్నది విమాన ప్రమాదంలో ఉన్నది విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కాదు.
కీ వర్డ్ సెర్చ్ ద్వారా జూన్ 12న విమాన ప్రమాదంలో మరణించిన సిబ్బంది వివరాల కోసం వెతికాము.
ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ జూన్ 17న ప్రచురించిన కథనంలో ఈ వివరాలతో పాటు సిబ్బంది ఫోటోలు కూడా కనిపించాయి.
కథనంలో ఇచ్చిన ఫోటోలకు, వీడియోలో ఉన్న వారికి పోలికలు ఉన్నట్లు కనిపించలేదు.
వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో జూన్ 9న
ఇంస్టాగ్రామ్లో అప్లోడ్ చేయబడినట్లు కనుగొన్నాం. ఈ వీడియో పై 'ఒకే విమానంలో కష్టపడి పనిచేసే సిబ్బంది అందరూ' అని హిందీలో రాశారు.
"ULH విమానంలో ప్రయాణానికి ముందు మోటివేషన్" అని క్యాప్షన్లో ప్రస్తావించారు. ఈ వీడియోని పోస్ట్ చేసిన యశస్వి శర్మ కామెంట్ చేస్తూ, "అందరికీ హాయ్, నన్ను సంప్రదించినందుకు చాలా ధన్యవాదాలు - నేను సురక్షితంగా ఉన్నాను, ప్రస్తుతం ముంబైలో ఉన్నాను. జరిగిన దానికి నేను తీవ్రంగా కుంగిపోయాను. ఇది మాకు చాలా కష్టమైన సమయం" అని రాశారు.
ఈ వీడియో జూన్ 9న, అంటే విమాన ప్రమాదానికి మూడు రోజుల ముందే పోస్ట్ చేయబడింది. యశస్వి శర్మ చేసిన కామెంట్ ద్వారా వైరల్ వీడియోలో ఉన్నది అహ్మదాబాద్ విమాన ప్రమాదాలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కాదని తేలింది.
ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ, జూన్ 14న యశస్వి శర్మ తన
ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఇలా అన్నారు, "ఇటీవల నా వీడియోపై వ్యాపించిన పుకార్ల గురించి నాకు తెలుసు. అది వైరల్ అయింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులందరినీ ఇలాంటి ఖాతాను రిపోర్ట్ చేయమని అభ్యర్థిస్తున్నాను. దానిని తొలగించమని వారిని కోరుతున్నాను. మేము బ్రతికి లేమని ఇలాంటి వీడియోలను చూస్తే మా కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారు?... "
అయితే వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా సిబ్బంది కాదని తేలింది. కాబట్టి న్యూస్మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.