Fact Check: భారత డ్రోన్ దాడి తర్వాత రావల్పిండి స్టేడియం శిథిలమైందని AI ఫోటో వైరల్

పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం ఆపరేషన్ సింధూర్ భాగంగా జరిగిన భారత డ్రోన్ దాడిలో ధ్వంసమైందనే వాదనతో సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో, దాడిలో స్టేడియం దెబ్బతిన్నట్లు చూడవచ్చు.

By M Ramesh Naik
Published on : 20 May 2025 5:49 PM IST

A photo is going viral on social media with the claim that the Rawalpindi Cricket Stadium in Pakistan has been destroyed under Operation Sindoor. In this image, the stadium can be seen damaged in the attack.
Claim:రావల్పిండి క్రికెట్ స్టేడియం భారత డ్రోన్ దాడి తర్వాత శిథిలమైనట్లు చూపే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ ఫోటో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడింది.

హైదరాబాద్: పాకిస్థాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగిన భారత డ్రోన్ దాడిలో శిథిలమైనట్లు చూపే ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో స్టేడియం దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది.

ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ ఫోటోను షేర్ చేస్తూ, “పూర్తి గా కూలిపో లే...మిగతాది వాళ్ళే కూలగొట్టు కుంటారని వొదిలేశారేమో” అని క్యాప్షన్ రాశారు. (ఆర్కైవ్)

ఫాక్ట్ చెక్

న్యూస్‌మీటర్ వైరల్ ఫోటో ను పరిశీలించినప్పుడు, ఈ ఫోటో తప్పుడు క్లెయిమ్‌తో వైరల్ అవుతున్నట్లు తేలింది. వైరల్ ఫోటో నిజమైనది కాదు, ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడింది.

నిజాన్ని కనుగొనేందుకు, ముందుగా రావల్పిండి స్టేడియంపై దాడికి సంబంధించిన వార్తల కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాము. మే 8, 2025న హిందూస్థాన్ ఒక నివేదికలో, భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు రావల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ దాడి జరిగిందని పేర్కొన్నది. దీంతో కరాచీ కింగ్స్, పెషావర్ జల్మీ మధ్య జరగాల్సిన PSL మ్యాచ్ రద్దయింది.

వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, క్లెయిమ్‌ను ధృవీకరించే ఏ విశ్వసనీయ సమాచారం దొరకలేదు.

వైరల్ ఫోటోను రావల్పిండి క్రికెట్ స్టేడియంతో పోల్చి చూశాము. రెండు ఫోటోలు వేర్వేరుగా ఉన్నాయి. వైరల్ ఫోటోలో స్టేడియం గ్రౌండ్ చాలా చిన్నగా కనిపిస్తుంది, అయితే నిజమైన స్టేడియం చాలా పెద్దది. వైరల్ ఫోటోలో వీక్షకుల గ్యాలరీ రెండు అంతస్తులుగా ఉంది, కానీ నిజమైన స్టేడియంలో ఒకే అంతస్తు ఉంది.

ఈ అనుమానంతో, వైరల్ ఫోటో AI ద్వారా సృష్టించబడి ఉండవచ్చని భావించాము. దీన్ని ధృవీకరించేందుకు, Hive Moderation, Sight Engine వంటి AI డిటెక్టర్ టూల్స్‌తో పరిశీలించాము. ఈ రెండు టూల్స్ ఫోటో AI ద్వారా సృష్టించబడినట్లు నిర్ధారించాయి. Hive Moderation ప్రకారం, ఫోటో 98.1% AI సృష్టిత అవకాశం ఉంది.

ఈ సమాచారం ఆధారంగా, రావల్పిండి స్టేడియంపై భారత డ్రోన్ దాడి తర్వాత శిథిలమైనట్లు చూపే వైరల్ ఫోటో AI ద్వారా సృష్టించబడినదని నిర్ధారణగా చెప్పవచ్చు. కాబట్టి, న్యూస్‌మీటర్ ఈ వైరల్ క్లెయిమ్ తప్పు అని నిర్ధారిస్తోంది.

Claim Review:రావల్పిండి క్రికెట్ స్టేడియం భారత డ్రోన్ దాడి తర్వాత శిథిలమైనట్లు చూపే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ ఫోటో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడింది.
Next Story