Fact Check: గుంటూరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారు చుట్టూ జనసంద్రం? కాదు, అది సన్నీ లియోన్ 2017 కొచ్చి సందర్శన ఫోటో

గుంటూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహనం చుట్టూ భారీ జనసంద్రం ఉన్నట్లు చూపుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By -  M Ramesh Naik
Published on : 7 Feb 2026 7:30 AM IST

A photo claiming to show former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy’s vehicle surrounded by a massive crowd in Guntur is circulating widely on social media.
Claim:వైరల్ అవుతున్న ఫోటోలో కనిపిస్తున్న వాహనం గుంటూరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారు.
Fact:ఈ క్లెయిం తప్పు. ఇది 2017లో నటి సన్నీ లియోన్ కొచ్చి సందర్శన సందర్భంగా తీసిన ఫోటోను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.

హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడిపై వ్యాఖ్యల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలోకి వెళ్లిన నాలుగు రోజుల తర్వాత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరుకు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ నేపథ్యంలో ఒక వాహనం చుట్టూ భారీ జనసమూహం ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన సందర్భంగా తీసిన దృశ్యంగా పేర్కొంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఒక ఫేస్‌బుక్ పోస్టులో “నిన్న గుంటూరులో జగనన్న జనసంద్రం” అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను పంచుకున్నారు.(Archive)

ఫ్యాక్ట్ చెక్

న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ క్లెయిం తప్పని తేలింది. వైరల్ ఫోటోకు జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనతో ఎలాంటి సంబంధం లేదు.

ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2017 ఆగస్టు 17న బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన ఎక్స్ ఖాతాలో ఇదే ఫోటోను షేర్ చేసినట్టు గుర్తించాం. ఆమె “కేరళలోని కొచ్చిలో నా కారు అక్షరాలా ప్రేమ సముద్రంలో ఉంది!! ధన్యవాదాలు. #fone4” అంటూ పోస్ట్ చేశారు.

ఆ ఫోటో కొచ్చిలో ఒక మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి సన్నీ లియోన్ వెళ్లినప్పుడు తీసింది. ఆ సమయంలో భారీగా అభిమానులు గుమిగూడడంతో ట్రాఫిక్ కూడా తీవ్రంగా అంతరాయం కలిగిందని అప్పటి మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.) వెల్లడించాయి.

వైరల్ ఫోటోను అసలు చిత్రంతో పోల్చితే స్పష్టమైన మార్పులు కనిపించాయి. అసలు ఫోటోలో మెట్రో రైలు మార్గం కనిపిస్తుండగా, వైరల్ వెర్షన్‌లో దాన్ని ఫ్లైఓవర్‌లా మార్చినట్లు గుర్తించాం. ఇది డిజిటల్ ఎడిటింగ్ జరిగినట్లు సూచిస్తోంది.

కాబట్టి గుంటూరులో జగన్ మోహన్ రెడ్డి కారు చుట్టూ జనసంద్రం అనే క్లెయిం తప్పు. ఈ ఫోటో 2017లో సన్నీ లియోన్ కొచ్చి సందర్శన సమయంలో తీసినదే, దాన్ని తప్పుదోవ పట్టించేలా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.

Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిం తప్పు. ఇది 2017లో నటి సన్నీ లియోన్ కొచ్చి సందర్శన సందర్భంగా తీసిన ఫోటోను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు.
Next Story